మమతా పరేడ్ PARIలో మా సహోద్యోగి. అరుదైన ప్రతిభ, నిబద్ధత కలిగిన ఈ యువ జర్నలిస్ట్, డిసెంబర్ 11, 2022న విషాదకరంగా తన జీవితాన్ని ముగించింది.

ఆమె మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ ప్రత్యేక పాడ్‌కాస్ట్‌ని మేం మీకు అందిస్తున్నాం. ఇందులో మహారాష్ట్ర, పాలఘర్ జిల్లాలోని వాడా తాలూకాకు చెందిన తన ప్రజలైన వర్లీ ఆదివాసీ సముదాయపు కథను మమత వివరిస్తుంది. ఈ ఆడియోను ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందు రికార్డ్ చేసింది.

ప్రాథమిక సౌకర్యాలు, హక్కుల కోసం వారి పోరాటాల గురించి మమత రాసింది. ప్రపంచ పటంలో కనిపించని అనేక చిన్న కుగ్రామాల గురించి ఈ జర్నలిస్ట్  సాహసి నివేదించింది. ఆకలి, బాల కార్మికులు, వెట్టి కార్మికులు, పాఠశాల విద్య, భూమి హక్కులు, స్థానభ్రంశం, జీవనోపాధి, ఇంకా మరెన్నో వెషయాలపై మమత వార్తాసేకరణ చేసింది.


ఈ ఎపిసోడ్‌లో మమత తన గ్రామమైన మహారాష్ట్రలోని నింబవలిలో జరిగిన అన్యాయాన్ని గురించిన కథనాన్ని వివరిస్తోంది. ముంబయి-వడోదర జాతీయ రహదారి కోసం ఒక నీటి ప్రాజెక్టును నిర్మిస్తామని మభ్యపెట్టి తమ పూర్వీకుల నుంచి వస్తోన్న భూమిని ఇచ్చేలా గ్రామస్తులను ప్రభుత్వ అధికారులు ఎలా మోసగించారో ఆమె వివరించింది. ఆ ప్రాజెక్ట్ వారి గ్రామాన్ని రెండుగా చీల్చుకుంటూ వెళ్ళింది, అందుకు ప్రభుత్వం అందించిన పరిహారం కూడా చాలా తక్కువ.

PARIలో మమత గురించి తెలుసుకుని, ఆమెతో కలిసి పనిచేయడాన్ని మేం చాలా గొప్పగా భావిస్తున్నాం; PARIలో ఆమె అందించిన మొత్తం తొమ్మిది కథనాల జాబితా ఇక్కడ ఉంది.

మమత తన రచనల ద్వారా, సముదాయంతో కలిసి తాను చేసిన పని ద్వారా జీవించేవుంటుంది. ఆమెను కోల్పోవడం చాలా లోతైన విషాదం.

ఈ పాడ్‌కాస్ట్‌ను రూపొందించడంలో సహాయం చేసినందుకు హిమాంశు సైకియాకు మా ధన్యవాదాలు

కవర్ ఇమేజ్‌పై ఉన్న మమత ఫొటో ఆమె ఫెలోగా ఉన్న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వెబ్‌సైట్ నుండి తీసుకున్నది. ఆ ఫొటోను ఉపయోగించుకునేందుకు మమ్మల్ని అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aakanksha

ଆକାଂକ୍ଷା (କେବଳ ନିଜର ପ୍ରଥମ ନାମ ବ୍ୟବହାର କରିବାକୁ ସେ ପସନ୍ଦ କରନ୍ତି) PARIର ଜଣେ ସମ୍ବାଦଦାତା ଏବଂ ବିଷୟବସ୍ତୁ ସଂପାଦକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Aakanksha
Editors : Medha Kale

ମେଧା କାଲେ ପୁନେରେ ରହନ୍ତି ଏବଂ ମହିଳା ଓ ସ୍ଵାସ୍ଥ୍ୟ କ୍ଷେତ୍ରରେ କାମ କରିଛନ୍ତି । ସେ ମଧ୍ୟ PARIର ଜଣେ ଅନୁବାଦକ ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ମେଧା କାଲେ
Editors : Vishaka George

ବିଶାଖା ଜର୍ଜ ପରୀର ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା। ସେ ଜୀବନଜୀବିକା ଓ ପରିବେଶ ପ୍ରସଙ୍ଗରେ ରିପୋର୍ଟ ଲେଖିଥାନ୍ତି। ବିଶାଖା ପରୀର ସାମାଜିକ ଗଣମାଧ୍ୟମ ପରିଚାଳନା ବିଭାଗ ମୁଖ୍ୟ ଭାବେ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି ଏବଂ ପରୀର କାହାଣୀଗୁଡ଼ିକୁ ଶ୍ରେଣୀଗୃହକୁ ଆଣିବା ଲାଗି ସେ ପରୀ ଏଜୁକେସନ ଟିମ୍‌ ସହିତ କାର୍ଯ୍ୟ କରିଥାନ୍ତି ଏବଂ ନିଜ ଆଖପାଖର ପ୍ରସଙ୍ଗ ବିଷୟରେ ଲେଖିବା ପାଇଁ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କୁ ଉତ୍ସାହିତ କରନ୍ତି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ବିଶାଖା ଜର୍ଜ
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sudhamayi Sattenapalli