‘ద్రవ్యోల్బణం ఇప్పటికే నెత్తిన ఉంది; ఇప్పుడు ఏనుగులు కూడా వచ్చిపడ్డాయి’
ఈ వేసవికాలంలో, మహారాష్ట్రలోని ఆదివాసీ గ్రామమైన పళస్గావ్ గ్రామస్థులు ఊహించని విధంగా వచ్చిపడిన ముప్పు కారణంగా తమ అటవీ ఆధారిత జీవనోపాధిని వదులుకుని ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. తమ జీవితాల గురించి ఎంతో అందోళనపడుతోన్న వీరు 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఎంతమాత్రం ఉత్సాహంగా లేరు