నిరసన తెలుపుతోన్న ఆశాలకు మళ్ళీ ‘మరోసారి’ హామీలిచ్చిన ప్రభుత్వం...
మహారాష్ట్రలోని 36 జిల్లాలకు చెందిన వేలాదిమంది ఆశాలు - మహిళా ఆరోగ్య కార్యకర్తలు - మెరుగైన వేతనాలను సకాలంలో చెల్లించాలని, ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆజాద్ మైదాన్ గ్రౌండ్స్లో ఇటీవల వారి నిరసన 21 రోజుల పాటు కొనసాగింది. వారి డిమాండ్లను పరిశీలిస్తామని ఈ క్లిష్టమైన పనులు చేసే మహిళా ఆరోగ్య కార్యకర్తలకు రాష్ట్రం మరోసారి హామీ ఇవ్వడంతో ఈ అందోళనను విరమించారు. గత ఆరు నెలల్లో ఇది మూడో అధికారిక హామీ, అయితే చేసిన వాగ్దానాలు మాత్రం కాగితాల మీదే మిగిలిపోయాయి. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మహిళల గురించీ, వారి సంఘీభావం గురించీ, తమ హక్కుల కోసం వారు చేసే పోరాటం గురించీ ఒక కథనం

















