ఇది భారీ వ్యవస్థ - పంజాబ్ అంతా కలిపి (2019-20లో) 152 ప్రధాన యార్డులు, 279 ఉప యార్డులు, 1,389 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి, జస్వీందర్ సింగ్ కోసం ఒక భద్రతా వలయాన్ని ఏర్పరిచాయి. ఈ మండి వ్యవస్థలో రైతు సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది, సంగ్రూర్ జిల్లాలోని లాంగోవల్ పట్టణానికి చెందిన 42 ఏళ్ల జస్విందర్, అతని కుటుంబంతో కలిసి 17 ఎకరాలు సాగు చేస్తాడు. “నేను పంట చేతికి రాగానే ఎలాంటి సందేహం, భయం లేకుండా దానిని మండికి తీసుకురాగలను. నాకు ఈ పని ఎలా చేయాలో తెలుసు కాబట్టి నాకు రావలసింది నాకు తప్పకుండా వస్తుందని కూడా తెలుసు.“
ప్రధాన యార్డ్లు చాలా భారీ మండీలుగా మారతాయి (ఇక్కడ ఫోటోలలో ఉన్న సునమ్లో ఉన్నట్లు). ఈ యార్డులు రైతులు తమ పంటను తీసుకు వచ్చి కుప్పలుగా పోయడానికి చాలా రకాల సౌకర్యాలతో కొన్ని స్థలాలున్నాయి. మామూలుగా వారి ఆర్తియ కమిషన్ ఏజెంట్ల షాపుల ముందే కుప్పపోస్తారు. ఒకవేళ ఆ సంవత్సరం ఉత్పత్తికి ప్రిన్సిపల్ యార్డ్లోని స్థలం సరిపోకపోతే సబ్-యార్డ్లస్థలాలను వినియోగిస్తారు. గ్రామాలలో(షెరాన్ వంటి గ్రామాలలో) కొనుగోలు కేంద్రాలు చిన్న మండీలుగా మారాతాయి. ఇవన్నీ కలిపితేనే పంజాబ్ విస్తారమైన వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్య కమిటీ(APMC) నెట్వర్క్ అవుతుంది
"నా పంటను విక్రయించినప్పుడు, నాకు ఆర్తియా నుండి J- ఫారమ్ వస్తుంది. ఈ ఫారమ్ నాకు చెల్లింపు వచ్చే వరకు సెక్యూరిటీగా పనిచేస్తుంది" అని జస్వీందర్ చెప్పారు. "ఇది ప్రభుత్వ ఏర్పాటు కనుక, నా చెల్లింపుతో ఏదైనా అనుకోని ఇబ్బంది ఎదురైతే, నాకు చట్టం నుండి రక్షణ ఉంటుందని, అదే పెద్ద భరోసా అని అని నాకు తెలుసు," అని ఆయన చెప్పారు (పంజాబ్ వ్యవసాయంలో ఉత్పత్తి మార్కెట్ల చట్టం 1961 సూచిస్తూ చెప్పారు).
APMC నెట్వర్క్ ప్రైవేట్ వ్యాపారులు లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా మార్క్ఫెడ్ (పంజాబ్ స్టేట్ కోఆపరేటివ్ సప్లై) వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నియంత్రిత ప్రక్రియలో పంటలను కొనుగోలు చేస్తుంది. ఇది ప్రధానంగా గోధుమనూ, వారిని స్టేట్ మాన్డేటెడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ (MSP) ద్వారా కొనుగోలు చేస్తుంది. ఒకసారి ధాన్యం పంజాబ్లోని మండీలకు చేరితే, FCI లేదా మార్క్ ఫెడ్ అధికారులు ధాన్యంలో ఉన్న తేమ పరిమాణం ద్వారా దాని నాణ్యతను పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని వేలం పాడి అమ్ముతారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్టియాల ద్వారా జరుగుతుంది. వీరు ఈ గొలుసులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు.
అందుబాటులో ఉండడం, విశ్వసనీయంగా పనిచేయడం- ఇటువంటి వ్యవస్థ వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు అని పాటియాలా జిల్లాలోని పాత్రాన్ తహసీల్లోని దుగల్ కలాన్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల అమన్ దీప్ కౌర్ చెప్పారు. “చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను నా ఉత్పత్తులను గ్రామ మండికి [కొనుగోలు కేంద్రానికి] తీసుకెళ్లగలను. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది పైగా నా పంటకు [MSPగా] నేను పొందే రేటు నాకు తెలుసు. రాష్ట్రంలో చెరకుతో ఏం జరుగుతుందో చూశాం. దీనికి కేంద్రీకృత వ్యవస్థ లేదు, కాబట్టి రైతులు తమ ఉత్పత్తులను కొన్నిసార్లు ఒక నగరంనించి మరో నగరానికి తీసుకెళ్లి ఎక్కడ మంచి ధర పలికితే అక్కడ అమ్మాలి. కానీ మేము మంచి ధర కోసం ఇలా తిరుగుతూ ఎలా ఉండగలం?





















