ఇంకాసేపట్లో, ఆహ్మదాబాద్ లో ఉన్న వెయ్యి రన్ వేల నుండి అవన్నీ ఒకేసారి టేక్ ఆఫ్ అవుతాయి. ఇంకెక్కడా కనిపించనన్ని బ్రహ్మాండమైన రంగులు ఆకాశంలో ఒక్కసారిగా ఎగురుతాయి. కానీ గర్వం అతిశయిస్తున్న వీటి పైలెట్లు మాత్రం వీటిని నేలపై నిలబడే నడుపుతారు. కానీ ఈ ఎగరవేస్తున్న వారందరికీ, ఎనిమిది మంది కార్మిక సమూహాలు సంవత్సరమంతా కష్టపడి ఈ పరిశ్రమను గాలిలో సృష్టిస్తారని తెలియదు. ఈ కార్మికులలో ఎక్కువమంది ఆడవారే ఉంటారు, ఎక్కువగా చిన్ననగరాలలో, లేక గ్రామాలలో. కాని వీరి జీవితాలు మాత్రం ఎప్పటికి పైకి ఎగరలేని.
ఇది మకర సంక్రాంతి సమయం, ఈ హిందూ పండుగను పురస్కరించుకుని నగరంలో ఎగరవేయబడే కాలిడోస్కోపిక్ రంగులలో కనపడే అనేక గాలిపటాలను అహ్మదాబాద్లో, గుజరాత్లోని ఆనంద్ జిల్లాలోని ఖంభాట్ తాలూకాలో - ముస్లిం, ఇంకా పేద హిందూ చునారా వర్గాలకు చెందిన మహిళలు తయారు చేశారు. ఐతే సహజంగానే, ఈ గాలిపటాలను ఎక్కువ ఎగరవేసేది హిందువులే.
ఈ మహిళలు సంవత్సరానికి 10 నెలలకు పైగా గాలిపటాల తయారీ పని చేస్తారు - ఇందులో చాలా తక్కువ రాబడి వస్తుంది - ముఖ్యంగా జనవరి 14న ఆకాశాన్ని అలంకరించే రంగురంగుల గాలిపటాలకు చాలా తక్కువ రాబడి వస్తుంది. ఈ తయారీలో నిమగ్నమైన రూ. 1.28 లక్షల మందిలో, ప్రతి 10 మందిలో 7 మంది మహిళలే పని చేస్తున్నారు. ఇది గుజరాత్లో 625 కోట్ల ఖరీదు చేసే పరిశ్రమ.
40 ఏళ్ల సబిన్ అబ్బాస్ నియాజ్ హుస్సేన్ మాలిక్ మాట్లాడుతూ, “పతంగ్ [గాలిపటం] సిద్ధమయ్యే ముందు ఏడు జతల చేతుల గుండా వెళ్లాలి. మేము ఖంభాట్ లాల్ మహల్ ప్రాంతంలోని ఒక చిన్న సందులో అతని 12 x 10 అడుగుల ఇల్లు-అంగడి లోపల కూర్చున్నాము. అతను బయటకు అందంగా కనపడే పరిశ్రమలో ఉన్న పనిని, అంతగా తెలియని మాకు తెలియచెబుతున్నాడు. వెనుకే నిగనిగలాడే వెండి పాకేజ్లో గాలిపటాలు, అమ్మకందారులకు పంపడానికి సిద్ధంగా కట్టిపెట్టి ఉన్నాయి.


















