మీరు మమ్మల్ని ఏరివేసి నీటిలో ముంచగలరని ఎక్కడో రాశాను. కానీ త్వరలోనే మీ కోసమంటూ నీరు మిగిలి ఉండదు. మీరు మా భూమిని, మా నీటిని దొంగిలించవచ్చు, కానీ మేం మీ భవిష్యత్ తరాల కోసం పోరాడుతూనే చనిపోతాం. నీరు, అడవి, భూమి కోసం మనం చేసే పోరాటాలు మనవి మాత్రమే కాదు, మనం ఎవరం ప్రకృతి నుండి వేరు కాదు. ఆదివాసీ జీవితాలు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి. మనల్ని మనం దాని నుండి వేరుగా చూడలేం. దేహవాలీ భీలీలో రాసే చాలా కవితలలో , నేను మన ప్రజల విలువలను కాపాడటానికి ప్రయత్నించాను.

ఆదివాసీ సమాజాల గురించి మన ప్రాపంచిక దృక్పథం ముందుముందు తరాలకు పునాది కాగలదు. అందుకే ఆ జీవన విధానానికీ, దృక్పథానికీ తిరిగి వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం లేదు. కానిపక్షంలో సామూహికంగా సమాజం ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిన దారి అవుతుంది.

జితేంద్ర వాసవ తన పద్యాన్ని దేహవాలీ భీలీలో చదువుతున్నారు, వినండి

ప్రతిష్ఠ పాండ్య ఈ పద్యాన్ని ఆంగ్లంలో చదువుతున్నారు, వినండి

అడుగు మోపేందుకు నేల

సోదరా,
నా సోదరా, నీకు అర్థం కాదు
బండలను పిండి చేయటమంటే,
మట్టిని మండించటం అంటే ఏమిటో
నీ ఇంట్లో వెలుగులు నింపుకొని
నువ్వు సంతోషంగా ఉన్నావ్
జగత్తులోని శక్తినంతా అదుపులోకి తెచ్చుకొని
అయినా నీకర్థం కాదు
నీటి బిందువు మరణించటమంటే ఏమిటో
నువ్వీ ధరిత్రిపై శ్రేష్ఠమైన సృష్టివి కదా
నీ శ్రేష్ఠత సాధించిన అతి పెద్ద ఆవిష్కరణ ‘ప్రయోగశాల’

ఈ జంతుజాలంతో నీకేం పని?
చెట్లూ, వృక్షజాలాల ఊసు నీకెందుకు?
ఆకాశంలో ఇల్లు కట్టాలనేది నీ కల
నువ్విప్పుడు ఈ భూమికి ప్రియపుత్రుడివి కాదు
సోదరా, తప్పుగా ఏమీ అనుకోకపోతే
'కలల నెలబాలుడు’అనొచ్చా నిన్ను?
నువ్వు పక్షివేమీ కాదు కానీ
ఎగరాలనే కలలు మాత్రం బాగానే కంటావ్
ఎంతైనా చదువుకున్నోడివి కదా

సోదరా, నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ,
చదువులేని మా లాంటి వాళ్ల కోసం ఈ ఒక్క పని చేసిపెట్టు
ఈ నేలపైన కనీసం అడుగు మోపేందుకైనా కాస్త జాగా వదిలిపెట్టు

సోదరా,
నా సోదరా, నీకు అర్థం కాదు
బండలను పిండి చేయటమంటే,
మట్టిని మండించటమంటే ఏమిటో
నీ ఇంట్లో వెలుగులు నింపుకొని
నువ్వు సంతోషంగా ఉన్నావ్
జగత్తులోని శక్తినంతా అదుపులోకి తెచ్చుకొని
అయినా నీకర్థం కాదు
నీటి బిందువు మరణించటమంటే ఏమిటో
నువ్వీ ధరిత్రిపై శ్రేష్ఠమైన సృష్టివి కదా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Poem and Text : Jitendra Vasava

குஜராத்தின் நர்மதா மாவட்டத்தில் உள்ள மஹுபாதாவைச் சேர்ந்த ஜிதேந்திர வாசவா, தெஹ்வாலி பிலி மொழியில் எழுதும் கவிஞர். ஆதிவாசி சாகித்ய அகாடமியின் (2014) நிறுவனத் தலைவரும், பழங்குடியினரின் குரல்களுக்காக அர்ப்பணிக்கப்பட்ட கவிதை இதழான லகராவின் ஆசிரியருமான இவர், ஆதிவாசி வாய்மொழி இலக்கியம் குறித்த நான்கு புத்தகங்களை வெளியிட்டுள்ளார். அவரது முனைவர் பட்ட ஆய்வு நர்மதா மாவட்டத்தைச் சேர்ந்த பில்களின் வாய்வழி நாட்டுப்புறக் கதைகளின் கலாச்சார மற்றும் புராண அம்சங்களில் கவனம் செலுத்துகிறது. PARI-ல் வெளியிடப்பட்ட கவிதைகள் அவரது வரவிருக்கும் முதல் கவிதைத் தொகுப்பின் ஒரு பகுதியாகும்.

Other stories by Jitendra Vasava
Illustration : Labani Jangi

லபானி ஜங்கி 2020ம் ஆண்டில் PARI மானியப் பணியில் இணைந்தவர். மேற்கு வங்கத்தின் நாடியா மாவட்டத்தைச் சேர்ந்தவர். சுயாதீன ஓவியர். தொழிலாளர் இடப்பெயர்வுகள் பற்றிய ஆய்வுப்படிப்பை கொல்கத்தாவின் சமூக அறிவியல்களுக்கான கல்வி மையத்தில் படித்துக் கொண்டிருப்பவர்.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli