హర్మన్‌దీప్ సింగ్ తన చుట్టూ పరచుకున్న రంగురంగుల గాలిపటాలతో నిలబడి ఉన్నాడు. అక్కడికి కాస్త ముందర పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న శంభూ సరిహద్దు వద్ద రైతులు దిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీ అవరోధాలు ఏర్పాటు చేశారు.

నిరసన తెలుపుతోన్న రైతులపై బాష్పవాయు గోళాలను కురిపిస్తోన్న డ్రోన్‌లను కిందకు దించడానికి అమృత్‌సర్‌కు చెందిన 17 ఏళ్ళ ఈ కుర్రాడు వినూత్నమైన పద్ధతిలో గాలిపటాలను ఉపయోగించాడు. “బాష్పవాయువు ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నేను నా కళ్ళ చుట్టూ టూత్‌పేస్ట్‌ను కూడా పూసుకున్నాను. మేం ముందుకు సాగి ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం,” అన్నాడు హర్మన్.

ఫిబ్రవరి 13, 2024న పంజాబ్ నుండి దిల్లీకి శాంతియుతంగా కవాతును ప్రారంభించిన వేలాదిమంది రైతులు, కార్మికులలో హర్మన్‌దీప్ ఒకరు. శంభూ సరిహద్దు వద్ద వారికి పారామిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది, పోలీసు అధికారులు ఎదురయ్యారు. దిల్లీలో తాము నిరసన చేపట్టబోయే ప్రదేశానికి రైతులు చేరుకోకుండా రోడ్డుపై ఇనుప మేకులు, కాంక్రీట్ గోడలు వేశారు.

మొదటి అవరోధం వద్ద, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (MSP) హామీ, రైతులకు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ, లఖింపూర్ ఖేరీ ఊచకోతలో నష్టపోయిన రైతులకు న్యాయం చేయటం, దోషులను అరెస్టు చేయడం, రైతులకు, కార్మికులకు పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడం, 2020-2021 నిరసనలలో అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం - ఈ ఐదు ప్రధాన డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ గురుజాండ్ సింగ్ ఖాల్సా మాట్లాడారు.

Left: 'I have also applied toothpaste around my eyes as it helps in reducing the effects of tear gas,' says Harmandeep Singh.
PHOTO • Vibhu Grover
Right: He is one among thousands of farmers and labourers from Punjab who began their peaceful march to Delhi on 13 February 2024
PHOTO • Vibhu Grover

ఎడమ: ‘బాష్పవాయువు ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని నేను నా కళ్ళ చుట్టూ టూత్‌ పేస్ట్‌ను కూడా పూసుకున్నాను' అని హర్మన్‌దీప్ సింగ్ చెప్పాడు. కుడి: ఫిబ్రవరి 13, 2024న పంజాబ్ నుండి దిల్లీకి తమ శాంతియుత యాత్రను ప్రారంభించిన వేలాది మంది రైతులు, కార్మికులలో హర్మన్‌దీప్ ఒకరు

Farmers preparing to fly kites to tackle the drone that fires tear shells
PHOTO • Vibhu Grover

బాష్పవాయువు గోళాలను పేల్చే డ్రోన్‌లను ఎదుర్కొనేందుకు గాలిపటాలు ఎగురవేసేందుకు  సిద్ధపడుతోన్న రైతులు

2020-21లో దేశవ్యాప్తంగా రైతులు సెప్టెంబర్ 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన మూడు వ్యవసాయ చట్టాలకు - ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; రైతుల ఉత్పత్తి, వర్తకం, వాణిజ్యం (ప్రోత్సాహం మరియు సులభతరం చేయటం) చట్టం, 2020 ; నిత్యావసర వస్తువులు (సవరణ) చట్టం, 2020 - వ్యతిరేకంగా సంఘటితమయ్యారు. నవంబర్ 2021లో ఈ చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఉద్యమంపై PARI కథనాలను చదవండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు: పూర్తి కథనాలు

“మేమెప్పుడూ నిరసనను ముగించలేదు. మేం కేంద్ర ప్రభుత్వంతో సమావేశమయ్యాం, ఆ సమావేశంలో కేంద్ర మంత్రులు మా డిమాండ్లన్నింటికీ అంగీకరించారు, వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అందువలన మేం దానికి విరామమిచ్చాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలు కొనసాగుతున్నందున ఇంతకాలం వేచి చూశాం. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఆ సమావేశాలను అకస్మాత్తుగా నిలిపివేసి, కమిటీని రద్దు చేశారు. దాంతో మళ్ళీ మేం తిరిగి రావలసివచ్చింది." కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ళ ఖాల్సా అన్నాడు.

పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో గుమిగూడి, నిరసనకారులు సరిహద్దు దాటడానికి వీలుగా అధికారులను సవాలు చేయడం, వారి దృష్టిని మరల్చడం వంటి పనులు చేయటం మొదలుపెట్టారు.

శంభూ వద్ద ఉంచిన అవరోధాలను నిరసనకారులు ఛేదించడం ప్రారంభించడంతో, పోలీసు అధికారులు వారిపై పలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఫలితంగా చాలామంది గాయపడ్డారు. గుంపును చెదరగొట్టడం కోసం పోలీసులు బాష్పవాయు గోళాలను గాలిలోకి వదలటానికి బదులు వ్యక్తులపైకి గురిచూసి వాటిని వదులుతున్నారని ఇదంతా చూసినవారు చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు నీటి ఫిరంగులను కూడా ప్రయోగించారు. బాష్పవాయు గోళాలను పగలగొట్టేందుకు పలువురు వృద్ధ రైతులు, కూలీలు కర్రలతో వచ్చారు. ప్రతి గోళాన్ని పనిచేయకుండా చేసి, ప్రజలు హర్షధ్వానాలతో సంబరాలు చేసుకున్నారు

As protestors started to break through the barricades at Shambhu, the police officials fired multiple tear gas shells. Elder farmers and labourers diffused the shells with a stick
PHOTO • Vibhu Grover
As protestors started to break through the barricades at Shambhu, the police officials fired multiple tear gas shells. Elder farmers and labourers diffused the shells with a stick
PHOTO • Vibhu Grover

శంభూ వద్ద ఉంచిన అవరోధాలను నిరసనకారులు ఛేదించడం ప్రారంభించడంతో, పోలీసు అధికారులు వారిపై పలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. వృద్ధ రైతులు, కూలీలు కర్రతో ఆ గోళాలను పగలగొట్టి వాటిని పనిచేయకుండా చేశారు

A farmer celebrates after successfully diffusing a tear gas shell with his stick at the Punjab-Haryana Shambhu border
PHOTO • Vibhu Grover

పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు వద్ద తన కర్రతో కొట్టి బాష్పవాయు గోళాన్ని విజయవంతంగా పనిచేయకుండా చేసి సంబరపడుతోన్న రైతు

బాష్పవాయు గోళాలను పనిచేయకుండా చేసినవారిలో అమృత్‌సర్‌కు చెందిన తిర్పాల్ సింగ్ అనే రైతు ఉన్నారు. "మా దగ్గర ఆయుధాలు లేవు. అయినప్పటికీ వాళ్ళు రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్లు, పెట్రోల్ బాంబులు, బాష్పవాయువు వంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నారు," అని ఆయన చెప్పారు. "ఈ రహదారి ప్రపంచానిది, మేం కేవలం దాని మీద ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాం. శాంతియుతంగా ఉన్నప్పటికీ మాపైన దాడులు జరుగుతున్నాయి. నాకిప్పుడు, శంభూ సరిహద్దులో బందీనైనట్టుగా అనిపిస్తోంది."

ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందని 50 ఏళ్ళ వయసున్న ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వం ఎమ్ఎస్‌పికి హామీ ఇవ్వడం లేదు. ఎందుకంటే వారు తమ పార్టీకి నిధులు సమకూర్చే ధనిక కార్పొరేట్లను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నారు," అన్నారతను. “ఎమ్ఎస్‌పి హామీ లేకపోతే, పెద్ద సంస్థలు మమ్మల్ని దోపిడీ చేయగలవు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, మా పంటలను మా వద్ద నుండి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆపైన చాలా ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. ప్రభుత్వం పెద్ద సంస్థలకు వందల కోట్ల రుణాలను రద్దు చేయగలిగినప్పుడు, కొన్ని లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న రైతుల, కార్మికుల రుణాలను కూడా మాఫీ చేయగలదని తిర్పాల్ సింగ్ అభిప్రాయపడ్డారు.

బాష్పవాయువు పొగలనూ, నీటి ఫిరంగులనూ ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత, చాలామంది నిరసనకారులు అవరోధాల రెండవ అంచెపై ఉన్న మేకులను తొలగించేందు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు రైతులను వెనక్కు వెళ్ళేలా చేయడానికి రైతుల కాళ్ళపైకి గురిచూసి రబ్బరు బుల్లెట్లను కాల్చడం కనిపించింది.

నిమిషాల వ్యవధిలోనే, రక్తాలు కారుతోన్న అనేక మంది రైతులను, కూలీలను కొంతమంది స్వతంత్ర వైద్యులు ఏర్పాటుచేసిన వైద్య శిబిరానికి తీసుకెళ్ళడం కనిపించింది.

"చివరి గంటలో నేను దెబ్బతిన్న 50 మందికి చికిత్స చేయాల్సివచ్చింది," అటువంటి ఒక వైద్య శిబిరానికి బాధ్యత వహిస్తోన్న డాక్టర్ మన్‌దీప్ సింగ్ చెప్పాడు. "నేను శంభూ సరిహద్దుకు వచ్చినప్పటి నుండి ఎంతమందికి చికిత్స చేశానో లెక్క కూడా మర్చిపోయాను," 28 ఏళ్ళ వయసున్న ఈ వైద్యుడు తన స్వగ్రామమైన హొషియార్‌పూర్‌లో బాబా శ్రీ చంద్‌జీ హాస్పిటల్‌ను నడుపుతున్నాడు. ఈ యువ వైద్యుడు కూడా రైతుల కుటుంబం నుంచే వచ్చాడు, 2020లో జరిగిన నిరసనలో పాల్గొన్నాడు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న న్యాయవాద, మానవతా సహాయ సంస్థ యునైటెడ్ సిఖ్‌తో కలిసి ఒక శిబిరాన్ని నిర్వహించాడు.

"తెగిన గాయాల నుండి కోసిన గాయాల వరకు, కొంతమంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ, ఇంకా అనేక రకాల సమస్యలతో జనం వచ్చారు" అని మన్‌దీప్ చెప్పాడు. “ప్రభుత్వం మన రైతుల గురించీ, వారి శ్రేయస్సు గురించి శ్రద్ధ పెట్టాలి. మనమే కదా వారిని ఎన్నుకుని అధికారంలోకి తెచ్చింది,” అన్నాడతను.

The crowd tries to break through the second barriers as they are attacked by tear gas shells
PHOTO • Vibhu Grover

బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ, రెండవ అంచె అవరోధాలను ఛేదించుకుని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోన్న ప్రజలు

Dr. Mandeep Singh (pink shirt) tends to his patients in his camp at Shambhu Border. He runs the Baba Shree Chand Ji hospital back in his village, Hoshiarpur
PHOTO • Vibhu Grover

శంభూ సరిహద్దులోని తన శిబిరంలో చికిత్స చేస్తోన్న డాక్టర్ మన్‌దీప్ సింగ్ (గులాబీ రంగు చొక్కా). అతను స్వగ్రామమైన హొషియార్‌పూర్‌లో బాబా శ్రీ చంద్‌జీ ఆసుపత్రిని నడుపుతున్నాడు

మైదానంలో ఉన్న మరో వైద్యురాలు దీపిక. వైద్య శిబిరంలో సహాయం చేయడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నుండి వచ్చిన ఈ 25 ఏళ్ళ యువతి ఇలా అంటోంది, “శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు, ప్రజలు ఆందోళననూ అసౌకర్యాన్నీ అనుభవిస్తున్నారు. నిరంతర బాష్పవాయు ప్రయోగంతో వచ్చే పొగనంతా పీల్చుకోవటం వల్ల వారు పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు.”

ఇక్కడ సహాయం చేస్తున్నది ఒక్క వైద్యులే కాదు - ఈ అవరోధాలకు కొద్ది మీటర్ల దూరంలో జనం తమ ట్రాలీలను ఏర్పాటు చేయటంలోనూ, అందరికోసం లాంగర్ తయరుచేయటంలోనూ తీరికలేకుండా ఉన్నారు. చాలామంది తమ కుటుంబాలతో సహా అక్కడికి వచ్చారు. గుర్‌ప్రీత్ సింగ్ తన చిన్నకుమారుడు తేజస్‌వీర్‌తో సహా వచ్చారు. "మా పోరాటాన్ని చూసేందుకు నేను నా కొడుకుని ఇక్కడకు తెచ్చాను," పటియాలా నుంచి వచ్చిన గుర్‌ప్రీత్ చెప్పారు. "మనం మన హక్కుల కోసం పోరాడటం ఎందుకు ముఖ్యమో నేను అతనికి బోధించాలనుకుంటున్నాను. ఎందుకంటే మనలను అణచివేసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులుగా, కార్మికులుగా మనం చేయవలసింది ఇదే," అని ఆయన అన్నారు.

నిరసన వేదిక చుట్టూ విప్లవ గీతాలు, నినాదాలు మోగుతున్నాయి. “ ఇక్కీ దుక్కీ చక్ దేయాంగే, తౌణ్ చే గోటా రఖ్ దేయాంగే " [మేం ప్రతి టామ్‌నీ, డిక్‌నీ, హ్యారీని మట్టికరిపిస్తాం, వారి మెడలు మా కాళ్ళ క్రింద ఉంటాయి], అని నినాదాలు చేస్తూ కవాతు చేస్తూ ఎక్కువమంది ప్రజలను సమీకరిస్తున్నారు.

"ఇది రైతుల ప్రాథమిక హక్కుల కోసం చేసే పోరాటం కాబట్టి నేను నిరసన తెలుపుతున్నాను," అని రాజ్ కౌర్ గిల్ చెప్పారు. చండీగఢ్‌కు చెందిన 40 ఏళ్ళ రాజ్ కౌర్ 2021లో చండీగఢ్‌లో రైతుల నిరసనలకు నాడీ వేదిక అయిన మట్కా చౌక్‌లో కేంద్ర బిందువుగా కనిపించేవారు.

“ఎమ్ఎస్‌పిని అందించకపోవడం ద్వారా ప్రభుత్వం రైతు ప్రాథమిక మనుగడను చాలా కష్టతరం చేస్తోంది. ఇదంతా దేశాన్ని పోషించేవారిని దోపిడీ చేస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చెందడానికే,” అని ఆమె చెప్పారు.

"వాళ్ళెన్నటికీ విజయం సాధించలేరు."


RAF officers and the Haryana Police stationed at Shambhu border to stop farmers and labourers from marching to Delhi
PHOTO • Vibhu Grover

దిల్లీకి కవాతు చేస్తూ వస్తున్న రైతులను, కూలీలను అడ్డుకునేందుకు శంభూ సరిహద్దు వద్ద నిలబడివున్న RAF అధికారులు, హర్యానా పోలీసులు

At the Shambhu border, they were met with paramilitary, RAF, and police officers. Concrete walls had been set up along with nails laid on the road
PHOTO • Vibhu Grover

శంభూ సరిహద్దు వద్ద వారికి పారామిలటరీ, RAF, పోలీసు అధికారులు ఎదురయ్యారు. రోడ్డుమీద మేకులు చల్లి, కాంక్రీట్‌ గోడలను ఏర్పాటు చేశారు

'We are not armed yet they use weapons like rubber bullets, pellets, petrol bombs and tear gas,' says Tirpal Singh
PHOTO • Vibhu Grover

‘మేం నిరాయుధంగా ఉన్నాం. అయినా వాళ్ళు రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్లు, పెట్రోల్ బాంబులు, బాష్పవాయువు వంటి ఆయుధాలను ఉపయోగించారు,' తిర్పాల్ సింగ్ అన్నారు

From around the protest site, revolutionary songs and slogans ring out
PHOTO • Vibhu Grover

నిరసన ప్రదేశానికి చుట్టుపక్కలంతా విప్లవ గీతాలతో, నినాదాలతో మారుమోగిపోతోంది

Gurpreet Singh is here with his son Tejasveer. 'I got my son here so that he can see our struggle,' he says
PHOTO • Vibhu Grover

గుర్‌ప్రీత్ సింగ్ తన చిన్నకుమారుడు తేజస్‌వీర్‌తో ఇక్కడకు వచ్చారు. 'మా పోరాటాన్ని చూసేందుకు నేను నా కొడుకుని ఇక్కడకు తీసుకువచ్చాను,' అన్నారాయన

A farmer struggles as he is hit by a tear gas shell
PHOTO • Vibhu Grover

బాష్పవాయు గోళం తగలటంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఒక రైతు

They cover their faces to save themselves from tear gas
PHOTO • Vibhu Grover

బాష్పవాయువు ప్రభావాన్ని నిరోధించటనికి వాళ్ళు తమ ముఖాలను కప్పుకున్నారు

'In the last hour, I have had to tend to 50 patients," says Dr Mandeep Singh and adds, 'Patients have come with several different types of problems ranging from cut wounds to incised wounds and some with breathing difficulties'
PHOTO • Vibhu Grover

'చివరి గంటలో నేను 50 మందికి చికిత్స చేయాల్సివచ్చింది,' అంటారు డాక్టర్ మన్‌దీప్ సింగ్. 'తెగిన గాయాల నుంచి కోసిన గాయాల వరకూ, ఇంకా ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ జనం ఇక్కడకు చికిత్స కోసం వస్తున్నారు’

Farmer throws an exploded tear gas shell that the police fired back at them
PHOTO • Vibhu Grover

పోలీసులు తమపై ప్రయోగించిన పేలిపోయిన బాష్పవాయు గోళాన్ని విసిరేస్తోన్న రైతు

A Farmer is injured after tear gas and rubber bullet firing by the security forces
PHOTO • Vibhu Grover

భద్రతా దళాలు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించటంతో గాయపడిన ఒక రైతు

Farmers carry a barricade to set it up and use it as a shield against the rubber bullets
PHOTO • Vibhu Grover

రబ్బరు బుల్లెట్ల నుంచి రక్షణగా ఉపయోగించేందుకు ఒక అవరోధాన్ని తమతో తీసుకువెళ్తోన్న రైతులు

Harmandeep Singh along with other farmers who used kites to bring down drones
PHOTO • Vibhu Grover

ఇతర రైతులతో కలిసి డ్రోన్‌లను కిందికి దించేందుకు గాలిపటాలను ప్రయోగించిన హర్మన్‌దీప్ సింగ్

Portrait of an elderly farmer who is marching from Punjab to Delhi
PHOTO • Vibhu Grover

పంజాబ్ నుండి దిల్లీకి కవాతు చేస్తూ వస్తోన్న ఒక వృద్ధ రైతు

'This government is trying to make the basic survival of farmers difficult by not providing MSP just so the big corporate houses can flourish and exploit those who feed the nation in the process. But they will never succeed,' says Raj Kaur Gill, an activist (not in the photo)
PHOTO • Vibhu Grover

'ఎమ్ఎస్‌పిని అందించకపోవడం ద్వారా ఈ ప్రభుత్వం రైతు ప్రాథమిక మనుగడను చాలా కష్టతరం చేస్తోంది. ఇదంతా దేశాన్ని పోషించేవారిని దోపిడీ చేస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చెందడానికే. కానీ వారెన్నటికీ విజయాన్ని సాధించలేరు,' అంటారు రాజ్ కౌర్ గిల్ అనే కార్యకర్త (ఈ ఫొటోలో లేరు)

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Vibhu Grover

Vibhu Grover is an independent journalist based in Delhi.

Other stories by Vibhu Grover
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli