ఆర్. నల్లకణ్ణు 1925-2026
భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, జీవించి ఉన్న చివరి వీరులలో ఒకరైన ఆర్. నల్లకణ్ణు ఫిబ్రవరి 25న మరణించారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులలో చివరి వ్యక్తి అయిన ఆయన నా పుస్తకం 'ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్'లో కనిపించిన వలసవాద వ్యతిరేక యోధులలో ఒకరు.
2022 స్వాతంత్ర్య దినోత్సవం నాడు, తమిళనాడు ప్రభుత్వం ఆయనకు తగైసార్ తమిళర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. రాష్ట్రంలోని అత్యున్నత పురస్కారమైన దీని విలువ రూ. 10 లక్షలు. కామ్రేడ్ ఆర్ఎన్కెగా అందరికీ తెలిసిన ఆయన ఆ బహుమతిని స్వీకరించారు, కానీ తన సొంత డబ్బు రూ. 5,000 జోడించి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ రూ. 10 లక్షలను తిరిగి ఇచ్చేశారు. రాష్ట్రంలో రైతు ఉద్యమ స్థాపకుడు కూడా అయిన ఆయన అటువంటి వ్యక్తిత్వం కలవారు. ఆయన మరణం తమిళనాడులో ఒక శకానికి ముగింపు పలికింది.













