వీడియో చూడండి: మేం చచ్చేంతవరకూ మాకున్న పని ఇదొక్కటే

2019లో బకింగ్‌హామ్ కెనాల్ ప్రాంతంలో ప్రయణిస్తుండగా నేనామెను మొదటిసారిగా గమనించాను. ఒక గ్రీబ్ పక్షిలాగా ఆ కాలువలోకి దూకిన ఆమె, నీటి అడుగున ఈత కొట్టడంలో ఆమె చూపించిన నేర్పు నా దృష్టిని ఆకర్షించాయి. నదీగర్భంలో ఉండే గండ్ర ఇసుకలోకి తన చేతులను వేగంగా పోనిచ్చి, అక్కడ ఉన్న అందరికంటే కూడా వేగంగా ఆమె రొయ్యలను పట్టుకుంటారు.

గోవిందమ్మ వేలు తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన ఇరుళర్ సముదాయానికి చెందినవారు. ఆమె చిన్న బాలికగా ఉన్నప్పటి నుండి రొయ్యలను పట్టుకోవడానికి చెన్నై సమీపంలోని కొసస్తలైయాఱు నదిలో తిరుగుతూనేవున్నారు. ఇప్పుడు 70ల మలివయసులో చూపు మందగించి, గాయాలతో బాధపడుతున్నప్పటికీ, భయంకరమైన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె ఈ పనిని కొనసాగించేలా బలవంతం చేస్తున్నాయి.

చెన్నై ఉత్తర భాగంలోని కొసస్తలైయాఱు నది పక్కనే ఉన్న బకింగ్‌హామ్ కాలువలో ఆమె తన పనిలో మునిగివుండగా నేనీ వీడియోను చిత్రీకరించాను. రొయ్యలను పట్టుకోవడానికి కాలువలోకి దూకుతూనే, మధ్య మధ్య తన జీవితం గురించీ, రొయ్యలను ఇలా పట్టుకోవటమే తనకు తెలిసిన ఏకైక విద్య ఎలా అయిందో దానిగురించీ ఆమె మాట్లాదుతున్నారు.

గోవిందమ్మ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

M. Palani Kumar

ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది. యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.

Other stories by M. Palani Kumar
Text Editor : Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli