చాణ్డాలశ్చ వరాహశ్చ కుక్కుటః శ్వా తథైవ చ |
రజస్వలా చ షణ్డశ్చ నైక్షేరన్నశ్నతో ద్విజాన్ ||

చండాలుడు, ఊర పంది, కోడి, కుక్క,
బహిష్టు స్త్రీ, నపుంసకుడు భోజనం చేస్తున్న బ్రాహ్మణుని చూడరాదు

— మనుస్మృతి 3.239

ఒక్క దొంగచూపు మాత్రమే కాదు, ఈ తొమ్మిదేళ్ల బాలుడి పాపం మరింత పొగరుతో కూడినది. ఇంద్ర కుమార్ మేఘ్వాల్ అనే 3వ తరగతి విద్యార్థి తన దాహాన్ని ఆపుకోలేకపోయాడు. దళితుడైన ఆ బాలుడు అగ్రవర్ణ అధ్యాపకుల కోసం విడిగా ఉంచిన కుండ నుండి నీళ్ళు తాగాడు.

శిక్ష పడింది. రాజస్థాన్‌లోని సురానా గ్రామంలోని సరస్వతీ విద్యా మందిర్‌లో, 40 ఏళ్ల అగ్రవర్ణ ఉపాధ్యాయుడు చైల్ సింగ్ ఎలాంటి కనికరం లేకుండా ఆ బాలుడ్ని కొట్టాడు.

25 రోజుల తర్వాత, సహాయం కోసం 7 ఆసుపత్రులను సందర్శించిన తర్వాత, భారత స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు, జాలోర్ జిల్లాకు చెందిన ఈ చిన్నపిల్లవాడు అహ్మదాబాద్ నగరంలో తుది శ్వాస విడిచాడు.

ప్రతిష్ఠ పాండ్య చదువుతున్న కవితను వినండి

జాడీలో పురుగులు

అనగనగా ఒక బడిలో
ఒక కూజా ఉండేది
ఆ బడిలో దైవసమానుడైన గురువుండేవాడు
అక్కడ మూడు నిండు సంచులు -
ఒకటి బ్రాహ్మణునికి
ఒకటి క్షత్రియునికి
యింకొకటి దళితులు తెచ్చే రూపాయి బిళ్ళకి

అనగనగా ఒక ఎక్కడాలేని ఊరిలో
ఆ కూజా ఒక పసివానికి నేర్పింది కదా -
"దప్పిగొనడమొక నేరం.
నీ గురువొక ద్విజుడు,
జీవితమొక చెరగని గాయపుమచ్చ,
పసివాడా, నువ్వు - జాడీలో బంధింపబడ్డ ఒక పురుగువి."

ఈ జాడీకొక వింత పేరుంది: సనాతన దేశం
"నీ చర్మమొక పాపం,
పిల్లవాడా, నీదొక పాపిష్టి జాతి."
అయినా,
పిడచకట్టుకుపోయిన తన పలుచని నాలుక తడుపుకునేందుకు
ఆ అందమైన కూజాలోంచి ఒక్క చుక్క నీళ్లు తాగాడు

పాపం!
తట్టుకోలేనంత దప్పిక అది,
అప్పటికీ గ్రంథాలు చెప్పనే చెప్పాయి కదా:"ఇవ్వు, ప్రేమించు, పంచు" అని?
ధైర్యం చేసి చేతులు చాచాడు
చల్లని ఆ కూజాని ముట్టుకున్నాడు
దైవ సమానుడు గురువు,
తొమ్మిదేళ్ళ పసివాడు వీడు.

ఒక గుద్దుతో ఒక తన్నుతో
బలమైన ఒక కర్రతో
పేరులేని ఒక ఉగ్రత్వంతో
దారికొచ్చాడా పసివాడు
తీయని వెటకారంలా నవ్వుకొన్నాడా దైవ సమానుడు.

ఎడమకన్ను మీద గాయాలు,
కుడికన్ను నిండా క్రిములు,
నల్లగా కందిపోయిన పెదాలు,
ఆ గురువు ఆనందానికన్నట్టు.
పవిత్రమైనది అతని దాహం.
పరిశుద్ధమైనది అతని ధర్మం
మృత్యువు సంచలించే కుహరం అతని హృదయం.

ఒక నిట్టూర్పుతో
ఒక 'ఎందుకు?' అన్న ప్రశ్నతో
ఉవ్వెత్తున ఎగసిన ద్వేషంతో
అణగని ఆక్రోశంలో ఆ దాహానికొక పేరివ్వబడింది.
ఒక శ్మశానకీటకంలా తరగతి గదిలోని నల్లబల్ల మూలిగింది.

అనగనగా ఒక బడిలో
ఒక మృతదేహముండేది.
యెస్సార్! యెస్సార్! మూడు నిండు చుక్కలు!
ఒకటి మందిరానికి
ఒకటి రాజుకి
ఒకటి దళితులు మునిగే కూజాకి.

వచనానువాదం: సుధామయి సత్తెనపల్లి
కవితానువాదం: కె. నవీన్ కుమార్

Joshua Bodhinetra

ஜோஷுவா போதிநெத்ரா, பாரியின் இந்திய மொழிகளுக்கான திட்டமான பாரிபாஷாவின் உள்ளடக்க மேலாளராக இருக்கிறார். கொல்கத்தாவின் ஜாதவ்பூர் பல்கலைக்கழகத்தில் ஒப்பீட்டு இலக்கியத்தில் ஆய்வுப்படிப்பு படித்திருக்கும் அவர், பன்மொழி கவிஞரும், மொழிபெயர்ப்பாளரும், கலை விமர்சகரும், ச்மூக செயற்பாட்டாளரும் ஆவார்.

Other stories by Joshua Bodhinetra
Illustration : Labani Jangi

லபானி ஜங்கி 2020ம் ஆண்டில் PARI மானியப் பணியில் இணைந்தவர். மேற்கு வங்கத்தின் நாடியா மாவட்டத்தைச் சேர்ந்தவர். சுயாதீன ஓவியர். தொழிலாளர் இடப்பெயர்வுகள் பற்றிய ஆய்வுப்படிப்பை கொல்கத்தாவின் சமூக அறிவியல்களுக்கான கல்வி மையத்தில் படித்துக் கொண்டிருப்பவர்.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

பிரதிஷ்தா பாண்டியா பாரியின் மூத்த ஆசிரியர் ஆவார். இலக்கிய எழுத்துப் பிரிவுக்கு அவர் தலைமை தாங்குகிறார். பாரிபாஷா குழுவில் இருக்கும் அவர், குஜராத்தி மொழிபெயர்ப்பாளராக இருக்கிறார். கவிதை புத்தகம் பிரசுரித்திருக்கும் பிரதிஷ்தா குஜராத்தி மற்றும் ஆங்கில மொழிகளில் பணியாற்றுகிறார்.

Other stories by Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli
Translator : K. Naveen Kumar

K. Naveen Kumar is working as a Sericulture Officer in Anantapur, Andhra Pradesh. He is an aspiring poet and Telugu translator.

Other stories by K. Naveen Kumar