2024 సంవత్సరం PARI గ్రంథాలయానికి ఒక మైలురాయి వంటిది - మేం ఈ ఏడాది రికార్డు సంఖ్యలో క్యూరేట్ చేసిన, ఆర్కైవ్ చేసిన వాటిలో చట్టాలు, శాసనాలు, పుస్తకాలు, సమావేశాలు, వ్యాసాలు, సంకలనాలు, పదకోశాలు, ప్రభుత్వ నివేదికలు, కరపత్రాలు, సర్వేలు, ఆర్టికల్స్ ఉన్నాయి.
ఈ మధ్యలో ఇతరంగా మరింత గంభీరమైన రికార్డులు కూడా బద్దలయ్యాయి - 2024 అత్యధిక ఉష్ణొగ్రతలు నమోదైన ఏడాదిగా నిలిచింది. ఉష్ణొగ్రతలలో ఇది అంతకుముందు అత్యధిక ఉష్ణొగ్రతలు నమోదు చేసిన ఏడాదిగా రికార్డుల్లో నిలిచిన 2023 సంవత్సరాన్ని మించిపోయింది. మారుతున్న వాతావరణం వలస వెళ్ళే జాతులపై ప్రభావం వేసింది. ఈ జాతులలో ఐదింటిలో ఒకటి ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. భారతదేశంలోని చిత్తడి నేలలైన - స్పాంగ్, ఝీల్, సరోవర్, తాలాబ్, తాల్, కోలా, బిల్, చెరువు - ఇవన్నీ స్వయంగా ముప్పులో ఉన్నాయి.
కాలుష్యం, వేడిమి మధ్య ఉన్న సంబంధం చక్కగా నమోదయింది. దక్షిణాసియాలో కణరూప పదార్థం కారణంగా ఏర్పడే వాయు కాలుష్యం మరింత హానికరమైనది. భారతదేశంలో సాంద్రీకరణ ఒక క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాములు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించిన పరిమితి కంటే ఇది 11 రెట్లు ఎక్కువ. సాంద్రీకరణ చాలా ఎక్కువగా ఒక క్యూబిక్ మీటర్కు 102.1 మైక్రోగ్రాములు ఉన్న న్యూ ఢిల్లీలో, రైడ్-సోర్సింగ్ సేవలో పనిచేసే ఒక గిగ్ శ్రామికుడి అనుభవాల గురించి ఒక కామిక్ వచ్చేలా ప్రేరేపించింది







