మమతా పరేడ్ PARIలో మా సహోద్యోగి. అరుదైన ప్రతిభ, నిబద్ధత కలిగిన ఈ యువ జర్నలిస్ట్, డిసెంబర్ 11, 2022న విషాదకరంగా తన జీవితాన్ని ముగించింది.
ఆమె మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ని మేం మీకు అందిస్తున్నాం. ఇందులో మహారాష్ట్ర, పాలఘర్ జిల్లాలోని వాడా తాలూకాకు చెందిన తన ప్రజలైన వర్లీ ఆదివాసీ సముదాయపు కథను మమత వివరిస్తుంది. ఈ ఆడియోను ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందు రికార్డ్ చేసింది.
ప్రాథమిక సౌకర్యాలు, హక్కుల కోసం వారి పోరాటాల గురించి మమత రాసింది. ప్రపంచ పటంలో కనిపించని అనేక చిన్న కుగ్రామాల గురించి ఈ జర్నలిస్ట్ సాహసి నివేదించింది. ఆకలి, బాల కార్మికులు, వెట్టి కార్మికులు, పాఠశాల విద్య, భూమి హక్కులు, స్థానభ్రంశం, జీవనోపాధి, ఇంకా మరెన్నో వెషయాలపై మమత వార్తాసేకరణ చేసింది.



