ఎ బగ్స్ లైఫ్ సినిమాకి వచ్చిన సీక్వెల్ లాగా ఉందది. ఈ హాలీవుడ్ సినిమాలో, ఫ్లిక్ అనే చీమ బలమైన సైనికులను తన సైన్యంలో చేర్చుకుని అక్కడ దుష్టులు - దాడిచేసే గొల్లభామల పై యుద్ధం సాగిస్తుంది.
భారత దేశంలోని ఈ నిజ జీవిత అంకంలో, కోట్లాను కోట్ల జాతులలో 1.3 బిలియన్ మాత్రమే మనుషుల జాతి ఉంది. దాడి చేసే చిన్న ముక్కు గొల్లభామలు లేదా మిడతలు, ఈ ఏడాది మేలో మిలియన్ల కొద్దీ ఈదుకుంటూ వచ్చాయి. ఇవి పంటకొచ్చిన పావు మిలియన్ ఎకరాల పొలాలని ధ్వంసం చేశాయి. ఈ పొలాలు బీహార్, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయని దేశ వ్యవసాయ కమీషనర్ చెప్పారు.
గాలిలో పుట్టే ఈ దాడికర్తలకు దేశ సరిహద్దుల గురించి మతింపు ఉండదు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) ప్రకారం, మిడతలు 30 దేశాలలో, 16 మిలియాన్ చదరపు కిలోమీటర్ల పాటు పశ్చిమ ఆఫ్రికా నుండి ఇండియా వరకు వ్యాపించి ఉన్నాయి. ఒక చదరపు కిలోమీటరులో 40 మిల్లియన్ల ఉండే చిన్న మిడతల సమూహం - 35000 మంది మనుషులు, 20 ఒంటెలు, ఆరు ఏనుగుల ఒక్క రోజు ఆహారాన్ని తినెయ్యగలవు.
జాతీయ మిడతల హెచ్చరిక సంస్థ రక్షణ, దాని సభ్యులను- వ్యవసాయం, హోం వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌర విమానయానం, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖల నుండి చేర్చుకోవడంలో ఆశ్చర్యం లేదు.
అయితే, ఈ లక్షలాది కీటకాలు, సున్నితమైన సమతుల్యత ప్రమాదంలో పడటం వలన జరిగే పరిణామాలలో మిడతలు మాత్రమే విలన్లు కాదు. భారతదేశంలో, కీటక శాస్త్రవేత్తలు, ఆదివాసీలు, ఇతర రైతులు ఈ ‘దుష్టుల’ పేర్లను వరుసగా చెబుతున్నారు. ఇవి ఒకటి , రెండు కాదు, మనకు అసలు ఎన్నో తెలియని జాతులు కూడా ఇందులో ఉన్నాయి. ఆహార ఉత్పత్తికి అనుకూలమైన 'ప్రయోజనకరమైన తెగుళ్లు', అంటే ఇక్కడ ‘మంచివారు’- వాతావరణం మారుతున్నప్పుడు వారి నివాసాలలో ఇబ్బంది వచ్చి ‘దుష్టులు’ కూడా కావచ్చు.










