"మేం దస్రా నాచ్ (దసరా నృత్యం)ని ప్రదర్శించబోతున్నాం," అన్నారు ఇత్వారి రామ్ మచ్చియా బైగా.
"ఈ నృత్యం దసరాతో మొదలై మూడు నాలుగు నెలలు - అంటే ఫిబ్రవరి, మార్చ్ నెలలవరకూ - కొనసాగుతుంది. దసరా పండుగను జరుపుకున్న తర్వాత మా సాటి బైగా గ్రామాలను సందర్శించి, రాత్రంతా నాట్యం చేస్తాం," అని ఈ ఛత్తీస్గఢ్ బైగా సమాజ్ అధ్యక్షుడు అన్నారు.
నర్తకుడూ, రైతు కూడా అయిన అరవయ్యేళ్ళ వయసు దాటిన ఈయన కబీర్ధామ్ జిల్లా, పండ్రియా బ్లాక్లోని అమానియా గ్రామంలో నివసిస్తారు. రాయపూర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న దేశీయ ఆదివాసీ నృత్యోత్సవాలలో పాల్గొనేందుకు ఇత్వారీజీ తన నాట్య బృందంలోని ఇతర కళాకారులతో కలిసి రాయపూర్ వచ్చారు.
బైగా సముదాయం ఛత్తీస్గఢ్లోని ఏడు సమూహాలలో ఒకటైన ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహం (Particularly Vulnerable Tribal Group - PVTG)కు చెందినది. వీరు మధ్యప్రదేశ్లో కూడా నివసిస్తున్నారు


