రోజు సాయంత్రం సుమారు ఐదింటికి పని ముగించుకొని వచ్చాక డా.షబ్నం యాస్మిన్ నేరుగా తన లేతగోధుమరంగు ఇంటి డాబా మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ తను స్నానం చేసి, తనతో పాటు పని ప్రదేశానికి తీసుకెళ్లిన పెన్నులు, డైరీలతో సహా మిగతా వస్తువుల్నిచాలా జాగ్రత్తగా శుభ్ర పరిచి, తన బట్టలు ఉతుక్కొని (డాబా మీద వీటన్నిటికీ ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి), ఆపై తన కుటుంబంతో ఉండడానికి కిందకి వెళుతుంది. గత సంవత్సరం నుండి ఇదంతా నిత్యకృత్యంగా మారింది. .
“ప్రైవేట్ ఆస్పత్రులతో సహా అన్నీ మూతబడి ఉన్నప్పుడు కూడా నేను మాహారోగం (లాక్డౌన్) ఉన్నన్ని రోజులు పూర్తిగా పని చేసాను. నాకు ఎప్పుడూ టెస్టులో పాజిటివ్ రాలేదు, నా సహోద్యోగులు కొందరికి వచ్చింది. నిజానికి మేము ఆస్పత్రిలో రెండు కోవిడ్19 పాజిటివ్ గర్భవతులకు మంచి చికిత్సను అందించాం. ” అంటారు 45ఏళ్ల డా.యాస్మిన్. ఈశాన్య బీహార్ లోని కిషన్ గంజ్ అనే పట్టణంలో ఆమె ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న సదర్ హాస్పిటల్ లో ఆవిడ గైనకాలజిస్టు మరియు శస్త్రవైద్యురాలు.
షబ్నమ్ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ. తను కరోనావైరస్ వాహకంగా మారే అవకాశం ఏ మాత్రం తీసుకోలేదు. ఇంట్లో తన తల్లి; 18, 12 వయసు గల ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంతేగాక, మూత్రపిండాల సమస్యల నుంచి కోలుకుంటున్న 53 సంవత్సరాల తన భర్త ఇర్తజా హసన్ కూడా ఉన్నాడు కాబట్టి రెండింతలు జాగ్రత్తలు తీస్కోవాలి. “మా అమ్మ అజరా సుల్తానా వల్లే నేను (పోయిన ఒక సంవత్సరం) ఉద్యోగం చేయగలిగాను. తను బాధ్యత మొత్తం తీసుకుంది, లేకుంటే నేను అన్ని పాత్రలు కలిపి నేనొక్కడాన్నే పోషిస్తుంటాను- డాక్టర్, గృహిణి, టీచర్, ట్యూటర్” ,అని యాస్మిన్ అన్నారు.
2007 లో వైద్య విద్య పూర్తి చేసినప్పటి నుంచి తన జీవితంలో అది నిరంతరం కొనసాగుతూ ఉంది. “ఎంబీబీస్ చివరి సంవత్సరంలో నేను గర్భవతిని. పెళ్ళైన తర్వాత దాదాపు ఆరేళ్ళు నేను నా కుటుంబంతో ఎప్పుడు ఉండలేదు. నా భర్త లాయర్ గా పని చేసేవారు, పట్నాలో ప్రాక్టీస్ ఉండేది. నన్ను ఎక్కడికి పంపితే నేను అక్కడే ప్రాక్టీస్ చేసేదాన్ని” అన్నారు యాస్మిన్.
సదర్ హాస్పిటల్ లో నియామకానికి ముందు, డా.షబ్నమ్ 2011 లో తన ఇంటికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాకూర్ గంజ్ బ్లాక్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నియమితమై ఉంది. 2003 లో రాంచీ లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎంబీబీస్, 2007 లో పాట్నా మెడికల్ కాలేజ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ప్రైవేట్ గా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక తనకి ఈ ప్రభుత్వోద్యోగం వచ్చింది. ఠాకూర్ గంజ్ లోని పీహెచ్సీ కి వెళ్ళడానికి పసిబిడ్డయిన తన రెండో కొడుకుని తల్లి వద్ద వదిలేసి స్థానిక బస్ లో వెళ్ళొచ్చేది. ఇదంతా చాలా కష్టం, శ్రమతో కూడుకున్నది కావడంతో తొమ్మిది నెలల తర్వాత తన తల్లీపిల్లలతో ఠాకూర్ గంజ్ కి మారిపోయింది. తన భర్త ఇర్తజా పట్నాలొనే ఉంటూ ప్రతి నెల వాళ్ళని కలవడానికి వెళ్ళేవాడు.







