మధురైలో మా ఇంటికి ఎదురుగా ఒక దీపస్థంభం ఉండేది. దానితో నేను ఎల్లప్పుడూ సంభాషిస్తూ ఉండేవాడిని. దానితో నాకు ఒక ప్రత్యేకానుబంధం ఉండేది. చాలా ఏళ్ల వరకు, అంటే నేను స్కూల్ చదువు ముగించేవరకు మా ఇంట్లో కరెంటు ఉండేది కాదు. 2006లో మాకు కరెంటు వచ్చినా, మేమంతా 8x 8 అడుగుల ఇంట్లో ఉండేవారమి. అంటే ఒకే గదిలో ఐదుగురం ఉండేవాళ్ళము. దాని వలన ఆ వీధీ స్థంభం నన్ను ఇంకా దగ్గరకు తీసుకుంది.
మేము చిన్నప్పుడు చాలా ఇళ్లు మారాము. ఒక గుడిసె నుండి మట్టి ఇంటికి, ఆ తరవాత ఒక అద్దె ఇంటికి, ఇప్పుడు మేము 20x 20 అడుగుల ఇంట్లో ఉన్నాము. ఈ ఇల్లు నా తల్లిదండ్రులు పన్నేపన్నెండేళ్లుగా ఇటుక పై ఇటుక పేర్చి కట్టింది. నిజమే వారు ఒక మేస్త్రి ని పెట్టుకున్నా వారి స్వంత ఈ ఇంటిపై ధారబోశారు. ఈ ఇల్లు కడుతుండగానే మేము ఇక్కడ నివసించడం మొదలుపెట్టాము. ఇలా నేను ఉన్న ఇళ్లన్నీ దీపస్థంబాలకు దగ్గరగానే ఉండేవి. నేను చే గువేరా, నెపోలియన్, సుజాత, ఇంకా ఇతరుల కథలు ఈ దీపస్థంబపు వెలుగు వలయంలోనే చదువుకున్నాను.
ఇప్పుడు కూడా ఆ దీపస్థంభమే ఈ రచనకు సాక్షి.






























