పదేళ్ల నూతన బ్రాహ్మణే కి ఒకటే కుతూహలం. తన అమ్మమ్మ ఎందుకు నిరసన ప్రదర్శనకు వెళ్తుందో అని. కాబట్టి జిజాబాయి బ్రాహ్మణే ఆమెను వెంట తీసుకురావాలని నిర్ణయించుకుంది. జనవరి 26 న దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద చురచురలాడే ఎండలో కింద కూర్చున్న జిజాబాయి, "ఆదివాసుల బాధలను, సమస్యలను ఆమె అర్ధం చేసుకోవాలని నేను ఆమెను తీసుకువచ్చాను." అంది.
“ఢిల్లీ లో [మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా] నిరసన తెలిపే రైతులకు మద్దతు ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము. అంతేగాక మాకు స్థానిక డిమాండ్లు కూడా ఉన్నాయి,” అన్నారు 65 ఏళ్ల జిజాబాయి. నూతన్తో పాటు ఆమె జనవరి 25-26 తేదీలలో ఆజాద్ మైదానంలో బస చేశారు.
వీరు నాసిక్ జిల్లాలోని అంబేవాని గ్రామం నుండి జనవరి 23 న నాసిక్ నుండి బయలుదేరిన రైతుల బృందంతో కలిసి ఇక్కడికి వచ్చారు.
జిజాబాయి మరియు ఆమె భర్త, 70 ఏళ్ల శ్రావణ్ కోలి మహాదేవ్ ఆదివాసీ వర్గానికి చెందినవారు. దశాబ్దాలుగా,దిండోరి తాలూకాలోని తమ గ్రామంలో ఐదు ఎకరాల అటవీ భూమిని సాగు చేశారు. 2006 లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన తరువాత వారు భూమికి పట్టా పొందాలి. "కానీ మా పేరు మీద ఎకరం కన్నా తక్కువ భూమి వచ్చింది. దానిలో మేము వరి, గోధుమ, మినప,
ముంబైలో జరిగిన రిపబ్లిక్ డే నిరసన కోసం, నూతన్ తండ్రి, జిజాబాయి కుమారుడు సంజయ్, తన కుమార్తెను అమ్మమ్మతో వెళ్లనివ్వడానికి వెంటనే అంగీకరించారు. “నూతన్ 2018 లోనే కిసాన్ లాంగ్ మార్చ్ కోసం రావాలని అనుకుంది. అప్పుడు మేము నాసిక్ నుండి ముంబైకి ఒక వారం పాటు నడిచాము. అప్పటికి నా మనవరాలు చాలా చిన్నది. ఆమె నడవగలదో లేదో నాకు తెలియదు. ఈ రోజు ఆమె దూరాలు నడవగలిగే వయస్సులోకి వచ్చింది. పైగా ఈ మార్చ్ లో పెద్దగా నడిచేది కూడా ఏమి లేదు, ”అని జిజాబాయి అన్నారు.






