2011లో నేను వాళ్ళకి చెప్పాను. మీ యూనివర్సిటీ కొంతభాగం వరకు ఒక గ్రామంలో ఉంది. దీని నివాసితులు చాలాసార్లు స్థానభ్రంశం చెందారు. అది ఏ విధంగానూ మీ తప్పు లేదా బాధ్యత కాదు. కానీ వారిని గౌరవించండి.
ముందు ఈ విషయం వారిని కుదిపివేసినా, వారు గౌరవంగానే ఉన్నారు. వీరంతా ఒడిశా కోరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఉత్సాహవంతులైన విద్యార్థులు. వారిలో ఎక్కువమంది జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగాల నుండి వచ్చారు. చికాపూర్ కథ వారిని కలవరపెట్టింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పేరుతొ మూడు సార్లు ఏకపక్షంగా నిర్ణయించి స్థానభ్రంశం చేశారు.
నా మనసు 1993 చివర, 1994 మొదలులోకి వెళ్ళింది. అప్పట్లో గదాబా ఆదివాసీ అయినా ముక్త కదమ్(పైన ఉన్న ఫొటోలో మనవడితో పాటు ఉన్నది), 1960ల్లో భోరున కురిసిన వర్షపు రాత్రి వారిని ఎలా ఖాళీచేయించారో ఒక చెప్పింది. ఆమె తన ఐదుగురు పిల్లలను ఒక చోట చేర్చి, వారి నెత్తి మీద సామానులు పెట్టి, చీకటిగా ఉన్న అడవిలో, వర్షం పడుతుండగా తీసుకువెళ్ళింది. “మాకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. సాబ్ మమ్మల్ని వెళ్లమన్నాడు కాబట్టి వెళ్లాము. చాలా భయమేసింది.”
వారు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)కు MIG ఫైటర్ ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేయవలసి వచ్చింది. ఒడిశాలో ఆ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా రాలేదు, అక్కడ పని కూడా జరగలేదు. కానీ ఆ నేలను వారికి ఇప్పటిదాకా ఇవ్వలేదు. పరిహారమో?”మా కుటుంబానికి 60 ఎకరాల భూమి ఉండేది,” చెప్పారు జ్యోతిరామోయ్ ఖోరా. ఇతను దళితుడు, ఉద్యమకారుడు. చికాపూర్ స్థానభ్రంశం చెందడం గురించి ఇప్పటికి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. “ఆ తరవాత చాలా కాలానికి మాకు 60 ఎకరాల స్థలానికి పూర్తి పరిహారంగా - 15,000 రూపాయిలు లభించాయి.” ఖాళీచేసిన గ్రామస్తులు మళ్లీ తమకు నూతన గ్రామాన్ని నిర్మించుకున్నారు, ఇది కూడా వారి స్వంత భూమిలోనే, ప్రభుత్వానిది కాదు. ఈ కొత్త గ్రామానికి, పాత గ్రామాన్ని గుర్తుచేసుకుంటూ చికాపూర్ అన్న పేరును పెట్టుకున్నారు.




