చిన్న వెదురు షెడ్లోని ఒక ఇరుకైన మంచం మీద మోహిని కౌర్ కొలతలు మార్చడానికి లేదా కొత్తగా కుట్టడానికి అవసరమైన బట్టల కుప్పను ఉంచింది. నవంబర్ 2020లో సింగు నిరసన ప్రదేశానికి వచ్చిన న్యూ ఢిల్లీలోని స్వరూప్ నగర్కు చెందిన ఈ 61 ఏళ్ల వ్యక్తి ఇలా చెప్పింది. “నాకు టైలరింగ్ మరీ బాగా ఏమి రాదు, కానీ నేను చేయగలిగింది చేస్తాను. ఇక్కడ నిరసన తెలుపుతున్న రైతులు మనకు ఆహారాన్ని అందిస్తారు, నేను వారి కోసం చేయగలిగింది ఇది మాత్రమే, ” రైతు సంఘాలు తమ నిరసనను ఉపసంహరించుకునే వరకు మోహిని ఒక్కసారి కూడా ఇంటికి తిరిగి వెళ్లలేదు
ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింగు వద్ద ఆమె స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేసిన వార్త పంజాబీ వార్తాపత్రిక అజిత్లో వచ్చినప్పుడు, మోహినికి సహాయం చేయడానికి పంజాబ్కు చెందిన పాఠకుడికి అది ప్రేరణనిచ్చింది. ఈ ఏడాది జూలైలో, 22 ఏళ్ల హర్జీత్ సింగ్ అనే యువకుడు మోహిని షెడ్లో చేరి, ఆమెతో కలిసి పనిచేయదు మొదలుపెట్టాడు.
పంజాబ్లోని లూథియానా జిల్లాలోని ఖన్నాలో హర్జీత్కు టైలరింగ్ దుకాణం ఉంది. అతని తండ్రి నాలుగు ఎకరాల పొలంలో వరి, గోధుమలు, మొక్కజొన్న పండించే రైతు. “నేను నా దుకాణాన్ని నా ఇద్దరు కరిగార్ల [పనివాళ్ల] కు అప్పజెప్పి, మోహిని జీకి సహాయం చేయడానికి ఈ సంవత్సరం జూలైలో సింగు వద్దకు వచ్చాను. ఇక్కడ చాలా పని ఉంది; ఇంట పనిని ఆమె ఒంటరిగా చేయడం కష్టం."
మంచం, పక్కనే పనిచేసుకునే చెక్కబల్లతో పాటు, రెండు కుట్టు మెషిన్లు, పెడెస్టల్ ఫ్యాన్ షెడ్లో నిండిపోవడంతో, అక్కడ కదలడానికి ఎక్కువగా స్థలం లేదు. నేలపై, పాలు కాయడానికి పోర్టబుల్ గ్యాస్ డబ్బా స్టవ్ ఉంది. మోహిని లేదా హర్జిత్తో మాట్లాడేందుకు ఒక సమయంలో ఒక్కరు మాత్రమే లోపలికి అడుగు పెట్టగలరు. నిరసన స్థలంలో ఉన్న 'కస్టమర్లు' - రైతులు ఇంకా ఇతరులు - తలుపు వద్ద నిలబడ్డారు.







