ఆమెకు చిన్నప్పటి నుండి తరచుగా సుదీర్ఘ వరుసలో వేచి ఉండటం అలవాటు- నీటి కుళాయిల వద్ద, పాఠశాలలో, దేవాలయాలలో, రేషన్ దుకాణాల వద్ద, బస్టాపుల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వెలుపల. తరచుగా, ఆమెను ముఖ్యమైన వరుసలో కాకుండా, మిగితా వరుసలో విడిగా నిలబెట్టేవారు. చివరకు ఆమె వంతు వచ్చినప్పుడు ఆమెకు ఎదురయ్యే నిరాశలకు కూడా ఆమె అలవాటు పడింది. కానీ నేడు శ్మశాన వాటిక వెలుపల కూడా అదే జరగడం ఆమె భరించలేకపోయింది. ఆమె అతని మృతదేహాన్ని తనతో పాటు ఉన్న నిజాంభాయ్ ఆటోలో వదిలి ఇంటికి తిరిగి పరుగెత్తాలనుకుంది.
కొన్ని రోజుల క్రితం భిఖు తన వృద్ధురాలైన తల్లి మృతదేహంతో ఆక్కడ ఉన్నప్పుడు, క్యూలు ఎంత సేపు ఉన్నాయో అని ఆమె బాధతో ఆశ్చర్యపోయింది. కానీ తన తల్లి మరణం మాత్రమే అతన్ని విచ్ఛిన్నం చేయలేదు; డబ్బు, ఆహారం, ఉద్యోగం లేకుండా అతని ప్రజలు కష్టాలు పడటం, ఇవ్వవలసిన వేతనాలు చెల్లించడానికి మాలిక్ నెలలు నెలలు ఇబ్బంది పెట్టడం, తగినంత జీతం దొరకకపోవడం, ఇలాంటి పలు సందర్బాలలో అతను కృంగిపోవడాన్ని ఆమె చూసింది. అనారోగ్యం పాలు కాక మునుపే అప్పులు అతనిని విచిన్నం చేసాయి. ఈ కనికరంలేని రోగం బహుశా వారికి ఒక వరం కావచ్చు, అని ఆమె అనుకునేది. అప్పటి వరకు…



