మీడియా ఒప్పుకోలేకపోయింది ఏమిటంటే, ప్రపంచం ఇప్పటిదాకా చూసిన వాటిలో, ఇది అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక నిరసన - ఖచ్చితంగా ఈ మహారోగం నడుమన గొప్పగా నిర్వహించబడినది- ఇది బలమైన విజయం.
ఈ విజయం ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళుతుంది. అన్ని రకాల రైతులు, ఆడవారు, మగవారు - ఇందులో ఆదివాసీ, దళిత వర్గాలు కూడా ఉన్నాయి- ఈ దేశపు స్వేచ్చా పోరాటంలో కీలక పాత్రను వహించారు. మన దేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం జరుపుకుంటుండగా, ఢిల్లీ దగ్గర ఉన్న రైతులు అప్పటి గొప్ప పోరాటస్ఫూర్తిని తిరిగి పొందారు.
ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఎంత ప్రయత్నించినా ఒక వర్గం రైతులను ఒప్పించడంలో విఫలమైన’ తర్వాత తాను అలా చేస్తున్నానని చెప్పారు. కేవలం ఒక విభాగాన్ని మాత్రమే, గుర్తుంచుకోండి, మూడు అపఖ్యాతి పాలైన వ్యవసాయ చట్టాలు వారికి నిజంగా మంచివని అతను అంగీకరింపజేయలేకపోయారు. ఈ చారిత్రాత్మక పోరాటంలో మరణించిన 600 మందికి పైగా రైతుల గురించి ఆయన ఒక్క మాట కూడా లేదు. అతని వైఫల్యం, ఒప్పించే నైపుణ్యంలో మాత్రమే ఉందని, ఆ 'రైతుల విభాగాని’కి రానున్నలాభం అర్థంచేయించడం కాదని చెప్పకనే చెప్పారు. నిజమే, ఈ వైఫల్యం ప్రతిపాదించిన చట్టాలది కాదు, ఈ మహారోగం నడుమ దానిని రైతుల పై రుద్దడానికి ప్రయత్నించిన ప్రభుత్వానిది కాదు.
సరే, ఖలిస్తానీలు, దేశ వ్యతిరేకులు, రైతులుగా ముసుగు వేసుకున్న బూటకపు కార్యకర్తలు, మిస్టర్ మోడీ యొక్క చిలిపి చేష్టలను ఒప్పుకోవడానికి నిరాకరించిన 'రైతులలో ఒక విభాగం'గా పట్టభద్రులయ్యారు. ఒప్పించేందుకు నిరాకరించారా? ఒప్పించే విధానానికి పద్ధతి ఏమిటి? వారి వేదనలను వివరించడానికి వచ్చినప్పుడు వారికి రాజధాని నగర ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారానా? కందకాలు,ముళ్ల తీగలతో వారిని అడ్డుకోవడం ద్వారానా? నీటి ఫిరంగులతో కొట్టడం ద్వారానా? వారి శిబిరాలను చిన్నగులాగ్లగా మార్చడం ద్వారానా? కుటిల మీడియా రైతులను రోజూ దూషించడం ద్వారానా? యూనియన్ మినిస్టర్ లేక ఆయన కుమారుడు ఈ ప్రత్యేక విభాగాల పై వాహనాలు నడపడం ద్వారానా? ఈ ప్రభుత్వానికి ‘ఒప్పించడం’ అంటే తెలిసిన అర్థం ఇదేనా? ఇవి ఆయన ‘ఉత్తమ ప్రయత్నా’లంటే, ఇక దుర్భర ప్రయత్నాలు ఎలాంటివో చూసే ఉద్దేశం ఎవరికీ లేదు.











