లక్షలాది మనుషులకు నీటిపై, విద్యుత్తుపై కత్తెర వేయడం, అలా చేయడం ద్వారా వారిని తీవ్రమైన అనారోగ్యానికి గురి చేయడం, పోలీసులను పారా మిలటరీలను కట్-ఆఫ్ జోన్లలోకి తీసుకురావడం, అర్ధంలేని విపరీతమైన ఆంక్షలు విధించడం, జర్నలిస్టులు నిరసనకారులను చేరుకోవడం దాదాపుగా అసాధ్యమయేట్లు చేయడం, గత రెండు నెలల్లో తమలో ఇప్పటికే 200 మంది(అందులో ఎక్కువమంది శీతోష్ణ స్థితి వలన చనిపిపోయిన వారే) చావుని దగ్గరగా చూసిన రైతులను శిక్షించడం- ప్రపంచంలో ఎక్కడైనా ఇది మానవ హక్కుల పై సాగే అనాగరికమైన దాడిగా కనిపిస్తుంది.
కానీ మనలను పాలించే మన ప్రభుత్వం దీని కన్నా ముఖ్యమైన వ్యవహారాల గురించి ఊపిరి సలపనంత పనిలో ఉంది. భూమిపై ఉన్న ఒక గొప్ప దేశాన్ని కించపరిచిన, అవమానించిన భయంకరమైన ప్రపంచ ఉగ్రవాదులైన రిహన్న, గ్రెటా థన్బెర్గ్ యొక్క కుట్రను ఎలా ఛేదించాలి అనే ముఖ్యమైన ఆందోళనలలో మనం, మన ప్రభుత్వం మరియు పాలకవర్గం మునిగిపోయాము.
ఇదంతా గనక కథ అయ్యుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించేదేమో. కానీ వాస్తవానికి, ఇది కేవలం పిచ్చి.
అయితే ఇవన్నీ దిగ్భ్రాంతి కలిగించేవిగా తోచవచ్చు గాని ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికేమి లేదు. "కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన" అనే నినాదాన్ని నమ్మిన వారు కూడా ఈ పాటికి ఈ విషయాన్ని అర్ధం చేసుకునే ఉంటారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి అంతా - వారి మహా బలాన్ని చూపించడానికి వారు చేసే నేలబారు నెత్తుటి పాలన. కానీ బాధపడవల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి పరిస్థితులలో కూడా చాలా మంది వ్యూహాత్మకంగా పాటిస్తున్న మౌనం. వారిలో కొందరు అటువంటి చట్టాలని సమర్ధించి ప్రస్తుత ప్రభుత్వం తరఫున తమ వంతు యుద్ధాన్ని కూడా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మీరెమో ఇటువంటివారు ప్రజాస్వామ్యాన్ని ఇలా కాలరాయడాన్ని అంగీకరించరని అనుకుంటారు.
కొనసాగుతున్న రైతుల నిరసనలకు సమాధానం ఇచ్చే మార్గంలో నిజంగా ఏమి ఉందో కేంద్ర క్యాబినెట్లోని ప్రతి ఒక్క సభ్యుడికి తెలుసు .








