కోవిద్-19 పరీక్ష లో పాజిటివ్ అని వచ్చిన ఎనిమిది రోజులకి రాంలింగ్ సనప్, తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే మరణించాడు. కానీ అతనిని చంపింది వైరస్ కాదు.
అతను చనిపోయే కొన్ని గంటలు ముందు, నలభయ్ ఏళ్ళ రాంలింగ్, తన భార్య రాజుబాయికి ఫోన్ చేసాడు. “అతని చికిత్స కు అయిన ఖర్చుని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు”, అని అతని మేనల్లుడు 23 ఏళ్ళ రవి మొరలె చెప్పాడు. “అతని రెండెకరాల పొలాన్ని అమ్మేయాలేమో అని ఆలోచించాడు.”
మహారాష్ట్ర బీడ్ నగరంలోని డీప్ హాస్పిటల్ లో రాంలింగ్ అడ్మిట్ అయ్యాడు. మే 13 నుంచి ఆసుపత్రిలో ఉన్న ఇతని చికిత్స కోసం 1.6 లక్షలు తీసుకున్నారని, రాజుబాయి అన్న చెప్పాడు. “మేము ఎలానో రెండు విడతలు గా ఇచ్చాము. కానీ ఆ ఆసుపత్రి ఇంకా 2 లక్షలు అడుగుతోంది.” అని చెప్పాడు. “వాళ్ళు ఈ విషయాలు రోగి అటెండెంట్ కు చెప్పకుండా రోగికి చెప్పారు. అతనిని ఎందుకు కష్టపెట్టడం?”
తన సంవత్సర ఆదాయం కన్నా రెట్టింపు డబ్బు ఆసుపత్రి బిల్ కు కట్టాలన్న ఆలోచన రాంలింగ్ ను విపరీతంగా కలవరపెట్టింది. మే 21, పొద్దున్నే, అతను కోవిడ్ వార్డ్ నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి కారిడార్ లో ఉరి వేసుకున్నాడు.
మే 20 వ రాత్రి తనకు ఫోన్ చేసి బాధపడిన భర్త ను ఓదార్చడానికి ముప్పయి అయిదేళ్ల రాజూబాయి ప్రయత్నించింది. అతని మోటార్ సైకిల్ ని అమ్మేసి, పడమర మహారాష్ట్ర లో వారిద్దరూ పని చేసే షుగర్ ఫ్యాక్టరీ లో అప్పు తీసుకొవచ్చని చెప్పింది. అతని ఆరోగ్యం బాగుపడడమే ఆమెకు కోరుకునేది అని ఆమె అతనికి పదేపదే చెప్పింది. బహుశా రాంలింగ్ ఆ డబ్బును కూడగట్టలేనేమో అని అనుమానపడ్డాడనుకుంటాను.
ప్రతి సంవత్సరం, రాంలింగ్ రాజుబాబు దంపతులు బీడ్ జిల్లా, కైజో తాలూకా లో ఉన్న వారి కుగ్రామం నుంచి వలస వెళ్లి పడమర మహారాష్ట్ర లో ఉన్న చెరుకు తోటలలో పనిచేసేవారు. వారిద్దరూ కలిసి, నవంబరు నుంచి ఏప్రిల్ వరకు 180 రోజులు పని చేసి 60,000 రూపాయిల వరకు సంపాదించేవారు. వారు ఇక్కడ లేనప్పుడు 8 నుంచి 16 ఏళ్ళ లోపు ఉన్న వారి ముగ్గురు పిల్లలను, రాంలింగ్ తండ్రి చూసుకునే వాడు. రాంలింగ్ తల్లి చనిపోయింది.











