ముప్పై ఏళ్ళు దాటిన గణేశ్ పండిత్ కొత్త దిల్లీలోని పాత యమునా వంతెన, లోహా పుల్లో నివసించే అతి పిన్న వయస్కుడు. 'ప్రధాన స్రవంతి ' ఉద్యోగాలకు వెళ్ళేదుకు ఇష్టపడే తన సముదాయానికి చెందిన యువకులు స్విమ్మింగ్ కోచ్లుగానూ, పొరుగున ఉన్న చాందినీ చౌక్లోని రిటైల్ షాపుల్లోనూ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
దిల్లీ గుండా ప్రవహిస్తోన్న యమునా నది, గంగా నదికి ఉన్న ఉపనదులలో అతి పొడవైనది, నీటి పరిమాణంపరంగా రెండవ అతిపెద్దది (ఘాఘరా తర్వాత).
పండిత్ యమునా నదిపై ఫోటో షూట్లను నిర్వహిస్తారు, కర్మకాండలు నిర్వహించాలని కోరుకునే వ్యక్తులను నది మధ్య వరకు పడవలో చేరవేస్తారు. "విజ్ఞానం విఫలమైన చోట, విశ్వాసం పని చేస్తుంది," అని అతను వివరించాడు. అతని తండ్రి ఇక్కడ పూజారిగా ఉన్నారు. అతను, అతని ఇద్దరు సోదరులు "చిన్నవాళ్ళుగా ఉండగా జమున [యమున]లో ఈత నేర్చుకున్నారు." పండిత్ సోదరులు ఫైవ్ స్టార్ హోటళ్ళలో లైఫ్గార్డులుగా పనిచేస్తున్నారు.






