ఒక నాగుపాము దృఢమైన సాగ్వాన్ (టేకు) చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉంది. రట్టి తోలా గ్రామవాసులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది చలించలేదు.
ఐదు గంటల తర్వాత, దురదృష్టవంతులైన ఆ గ్రామస్థులు చివరకు సమీపంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్లో ఇంతకుముందు కాపలాదారుగా పనిచేసిన ముంద్రికా యాదవ్ను పిలిచారు. అతను పులులు, చిరుతపులులు, ఖడ్గమృగం, పాములతో సహా 200 కంటే ఎక్కువే జంతువులను రక్షించారు.
ముంద్రికా వచ్చిన వెంటనే మొదట నాగుపామును క్రిందికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు, అది వచ్చింది. “దాని నోట్లో ఒక వెదురు కర్రను పెట్టి తాడు బిగించాను. తర్వాత దాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకుపోయి మళ్ళీ అడవిలో వదిలేశాను,” అని 42 ఏళ్ళ ముద్రికా చెప్పారు. "ఇదంతా చేయటానికి నాకు కేవలం 20-25 నిమిషాల సమయం పట్టింది."






