అతను వేదిక మీదకి తన ప్రైజ్ ను అందుకోవడానికి వెళ్ళాడు. అది ఒక మెరిసే పైసా బిళ్ళ. అది కూడా ఒక మున్షి వద్దనుండి. మున్షి అంటే ఒక అనుభవజ్ఞుడైన అధికారి, ఎన్నో బడులు ఆయన నియంత్రణ లో ఉంటాయి. 1939 సంవత్సరంలో పంజాబ్ లో అతనికి 11 ఏళ్ళు మాత్రమే ఉన్నప్పుడు, మూడో తరగతిలో క్లాస్ టాపర్. మున్షి అతని తల మీద తట్టి ఇలా అరివమన్నాడు - ‘బ్రిటానియా జిందాబాద్, హిట్లర్ ముర్దాబాద్.’ చిన్నవాడైన భగత్ సింగ్ - ప్రసిద్ధుడైన అమరవీరుడు భగత్ సింగ్ కాదు, ఇతను వేరే అతను, ప్రేక్షకుల వైపు చూసి అరిచాడు: ‘ బ్రిటానియా ముర్దాబాద్, హిందుస్తాన్ జిందాబాద్.’
అతని అమాయకత్వానికి వెంటనే స్పందన వచ్చింది. అతనిని అక్కడికక్కడే మున్షి బాబు బాగా మందలించి, సముంద్రా ప్రభుత్వ పాఠశాల నుంచి పేరు కొట్టేశారు. ఇతర విద్యార్థులు నిశ్చేస్టులై కాసేపు ఉండి, ఆ తర్వాత పారిపోయారు. అప్పటి స్థానిక పాఠశాల అధికారి, ఈ రోజుల్లో అయితే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ కు సమానమైన అధికారం కలవాడు, ఇప్పుడు పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఉన్న ఈ భాగంలో డిప్యూటీ కమిషనర్ ఆమోదంతో ఒక లేఖను జారీ చేసారు. లేఖ అతని అతన్ని ‘ప్రమాదకారి’ అని ‘విప్లవకారి’ అని వివరించి, బహిష్కరణను ధృవీకరించింది. అప్పటికి అతని వయసు - పదకొండేళ్లు.
దీని అర్థం ఇక అతను బడికి వెళ్లలేడని- అక్కడ ఉన్న బడులు కూడా తక్కువే - ఇలా బ్లాక్ లిస్ట్ అయినా భగత్ సింగ్ కి ఎవరూ వారి స్కూల్ గేట్లను తెరవరు. అతని తల్లిదండ్రులతో పాటుగా చాలా మంది, ఈ నిర్ణయాన్ని మార్చుకొమ్మని స్కూల్ అధికారులను కోరారు. బాగా పరిచయాలున్న ఒక జమీందారు గులాం ముస్తఫా తన తరఫునుండి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ బ్రిటిష్ రాజ్యం అనుచరులు చాలా కోపంగా ఉన్నారు. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ గౌరవాన్ని అవమానపరచాడు. కానీ భగత్ సింగ్ జుగ్గీయాన్ తుళుకులీనే మిగిలిన జీవితంలో ఇక ఎప్పటికీ మామూలు బడికి వెళ్లలేక పోయాడు.
కానీ 93 ఏళ్ళ తరవాత కూడా ఆతను ఒక స్టార్ విద్యార్థి అయ్యాడు.
ఇదంతా హోషియా పుర జిల్లా లో రంగడ్ గ్రామం అతని ఇంట్లో మాతో సంభాషిస్తూ చిరునవ్వుతూ గుర్తుచేసుకొన్నాడు. దాని గురించి అతను ఇబ్బంది పడలేదా? అంటే, “అప్పుడు అనుకున్నా, ఇప్పుడు నేను బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు”, అని.












