గత మూడేళ్లలో మీరు ఎన్ని ఆసుపత్రులను సంప్రదించారు?
ఆ ప్రశ్నతో సుశీలా దేవి మరియు ఆమె భర్త మనోజ్ కుమార్ ముఖాల్లో అలసట, నిరాశ నీడలు కమ్ముకున్నాయి. జూన్ 2017లో బండికుయ్ పట్టణంలోని మధుర్ హాస్పిటల్లో సుశీల మొదటిసారిగా నస్బంది (స్టెరిలైజేషన్ ప్రక్రియ) పొందినది. అపటి నుండి ఆల్లీద్ధరు (వారి పేర్లు ఇక్కడ మార్చబడ్డాయి) మస్త్ ఆసుపత్రుల సుట్టు తిరిగి, లెక్క లేనన్ని పరీక్షలు, వైరుధ్య నిర్ధారణలు చేయిన్చుకున్నరు.
పెళ్లయిన 10 సంవత్సరాలలో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తరువాత నాల్గవ సంతానంగా , వారికి కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన ఒక సంవత్సరం తర్వాత, ఈ జంట తమ కుటుంబాన్ని, జీవితాన్ని మెరుగ్గా నిర్వహించాలనే ఆశతో, 27 ఏళ్ల సుశీలకు ట్యూబల్ లిగేషన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. రాజస్థాన్లోని దౌసా తహసీల్లోని ధని జమాని గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే కుండల్ PHC ఉండగా కూడా, వారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండికుయ్లోని ప్రైవేట్ ఆసుపత్రినే ఎంచుకున్నారు.
“ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో స్టెరిలైజేషన్ శిబిరాలు ఎక్కువగా శీతాకాలంలో నిర్వహించబడతాయి. మహిళలు చల్లని నెలల్లో ప్రక్రియను ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వేగంగా నయం అవుతుంది. వేసవి నెలల్లో శస్త్రచికిత్స చేయాలనుకుంటే మేము వారిని దౌసా మరియు బండికుయ్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళతాము, ”అని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) సునీతా దేవి, 31, చెప్పారు. ఆమె దంపతులతో కలిసి 25 పడకల సాధారణ ఆసుపత్రి అయిన మధుర్ ఆసుపత్రికి వెళ్లింది. ఇది రాష్ట్ర కుటుంబ సంక్షేమ పథకం కింద రిజిస్టర్ చేయబడింది, కాబట్టి సుశీల ట్యూబెక్టమీకి ఛార్జీ విధించలేదు. బదులుగా, ఆమెకు ప్రోత్సాహక మొత్తం రూ. 1,400 ఇచ్చారు.
శస్త్రచికిత్స జరిగిన కొన్ని రోజుల తర్వాత, సుశీలకు ఋతుస్రావం వచ్చింది. దానితో విపరీతమైన నొప్పి, ఆ తరవాత అలసట ఉండేది, ఇలా మూడు సంవత్సరాల వరకు కొనసాగింది.
“మొదట నొప్పి ప్రారంభమైనప్పుడు, మేము ఇంట్లో ఉన్న నొప్పి నివారణ మందులను ఆమెకు ఇచ్చాము. ఇది కొద్దిగా సహాయపడింది. ఋతుస్రావం అయినప్పుడు ఆమె ప్రతి నెలా ఏడుస్తూ ఉంటుంది” అని 29 ఏళ్ల మనోజ్ చెప్పాడు.
“నొప్పి తీవ్రమైంది. అధిక రక్తస్రావం వలన తల తిరిగిపోయేది. నేను ఎప్పుడూ బలహీనంగా ఉండేదానిని” అని 8వ తరగతి వరకు చదివిన గృహిణి సుశీల చెప్పారు.
ఇలా మూడు నెలల పాటు కొనసాగడంతో భార్యాభర్తలు సంకోచిస్తూ కుండల్లోని పీహెచ్సీకి వెళ్లారు.







